మస్క్‌ను రీట్వీట్‌ చేసిన కట్టప్ప కొడుకు

325
- Advertisement -

ప్రముఖ వ్యాపారవేత్త ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీని తన చేతుల్లోకి తీసుకున్న నాటి నుంచి ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు. అందులో భాగంగా భారత వ్యక్తి పరాగ్‌ఆగర్వాల్‌ సీఈవో ను ఫైర్‌ చేస్తూ వచ్చాడు. అలాగే కంపెనీలోని కీలకమైన వ్యక్తులను తీసివేస్తూ మరికొంతమందిని నియమించాడు. అయితే ట్విట్టర్‌ను మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు.

ఈ సందర్భంగా ఈ సైట్‌లో ప్రముఖులు సినిమా సెలబ్రిటీలకు బ్లూటిక్‌ ఇచ్చే విషయం తెలిసిందే. కొత్త మార్పుల్లో భాగంగా ఆ బ్లూటిక్‌ కావాలనుకునేవారు ప్రతినెలా కొంత మొత్తం పే చేయాలని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై కూడా మస్క్‌ ట్విట్‌ కూడా చేశారు. మస్క్‌ చేసిన ట్వీట్‌లో ఫిర్యాదులు చేసే వారందరికీ… దయచేసి ఫిర్యాదులు చేస్తూ ఉండండి కానీ దానికి 8డాలర్లు అవుతుంది అని రాసుకొచ్చాడు. దీంతో ఎంతో మంది విమర్శలు చేశారు.

 

అయితే తాజాగా దీనిపై కట్టప్ప తనయుడు శిబి సత్యరాజ్‌ విన్నూత్నంగా స్పందించారు. శిబి చేసిన ట్వీట్‌లో మస్క్‌ ట్వీట్‌ని ట్యాగ్‌ చేస్తూ… దయచేసి మీగూగుల్‌ పే నెంబర్‌ నాకు పంపించండి అని రాశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టిట వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి..

గుజరాత్ ఎన్నికలకు మోగిన నగారా

చీకోటి ప్రవీణ్‌తో ఆర్జీవీ భేటీ!

BB6..కర్రలతో దాడి!

- Advertisement -