దేశ ప్రజల విశ్వాసాన్ని గెలిచాం:ముర్ము

15
- Advertisement -

దేశ ప్రజల విశ్వాసాన్ని గెలిచి సభకు ఎన్నికయ్యారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరని భావిస్తున్నట్లు చెప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎంపీలుగా ప్రమాణస్వీకరాం చేసిన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. 18వ లోక్ సభను ఉద్దేశించి ప్రసంగించిన ముర్ము… మన దేశ ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్దవి అన్నారు.

సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు ఈసీకి అభినందనలు చెప్పారు. ప్రభుత్వ సుస్థిరత, నిజాయితీని నమ్మారని…. ఈ ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారన్నారు. రిఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ ఆధారంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు.

ప్రపంచమంతా భారత ఎన్నికలను నిశితంగా పరిశీలించిందని… ప్రజలు ప్రభుత్వాన్ని విశ్వసించి మళ్లీ పట్టం కట్టారని చెప్పారు. పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అయ్యిందని..భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందన్నారు.

Also Read:ఉపవాసంతో క్యాన్సర్‌కి చెక్!

- Advertisement -