వక్ఫ్ సవరణ బిల్లు అమోదం పొందడం చారిత్రాత్మకం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది న్యాయం, పారదర్శకత, జవాబుదారీతనం వైపు ఒక చారిత్రాత్మక అడుగు అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తాను 2008-2009 చట్టం చెప్పినట్లుగా, దేవుని ఆస్తి దోచుకోవడం కేవలం దేశ ద్రోహం కంటే ఎక్కువని.. ఇది దేవుడికి ద్రోహమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
కొత్త UMEED చట్టం కంటే ఎక్కువని.. ఇది పవిత్ర ఆస్తులను రక్షించడం, వక్ఫ్ బోర్డును బలోపేతం చేయడం చేస్తుందని అన్నారు. మోదీ దార్శనిక నాయకత్వంలో ఎన్డీయే పరిపాలన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి తన నిబద్ధతను మరోసారి నిరూపించుకుందన్నారు. సంవత్సరాలుగా, వక్ఫ్ బోర్డుల కార్యకలాపాల గురించి తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయన్నారు. వక్ఫ్ బోర్డు సవాళ్లను పరిష్కరించడం, పారదర్శకతను పెంచడం, వక్ఫ్ ప్రయోజనాలు పేద ముస్లింలకు చేరేలా చూడటం, ముస్లిం మహిళలకు బోర్డులో ప్రాతినిధ్యం కల్పించడం వైపు ఈ సవరణ ఒక ముఖ్యమైన అడుగు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతి ఆందోళనను పరిష్కరించారని, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు. మైనారిటీ వ్యవహారాల సంక్షేమ మంత్రి కిరణ్ రిజిజు, హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ఎన్డీయే నాయకుడు జేపీ నడ్డాలకు తాను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
Also Read:CMRL కేసు.. చిక్కుల్లో కేరళ సీఎం కుమార్తె!

