యూఏఈలో నెతన్యాహు రహస్య పర్యటన?

7
- Advertisement -

ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సైనిక చర్యలు (ఆపరేషన్ రోరింగ్ లయన్) కొనసాగుతున్న తరుణంలో, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెన్జమిన్ నెతన్యాహు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో “రహస్యంగా పర్యటించినట్లు” ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ప్రకటించింది. 2020లో ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించుకున్న గల్ఫ్ దేశంతో బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన సాగిందని పేర్కొంది.

నెతన్యాహు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో భేటీ అయ్యారని, ఈ సమావేశం ఇరు దేశాల మధ్య సంబంధాలలో “చారిత్రాత్మక ముందడుగు”కు దారితీసిందని ఇజ్రాయెల్ వెల్లడించింది. యూఏఈకి ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ వైమానిక రక్షణ వ్యవస్థలను, వాటిని నిర్వహించే సిబ్బందిని పంపినట్లు ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి మైక్ హక్కబీ వెల్లడించిన మరుసటి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం.

Also Read:కొబ్బరి సాగులో గుజరాత్ టాప్!

అయితే, ఇజ్రాయెల్ ప్రధాని పర్యటన వార్తలను యూఏఈ తీవ్రంగా ఖండించింది. నెతన్యాహు తమ దేశానికి రాలేదని, అలాగే ఎటువంటి ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బృందాన్ని తాము స్వీకరించలేదని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.ఇజ్రాయెల్‌తో మా సంబంధాలు బహిరంగమైనవి మరియు అబ్రహం ఒప్పందాల పరిధిలోనే జరుగుతాయి. ఎటువంటి అపారదర్శక లేదా అనధికారిక ఏర్పాట్లు మా మధ్య లేవు. అధికారిక ప్రకటనలు లేకుండా వస్తున్న ఇలాంటి వార్తల్లో నిజం లేదు అని యూఏఈ పేర్కొంది.

- Advertisement -