మరోసారి మంచిమనసు చాటుకున్న మంత్రి కేటీఆర్….

195
ktr
- Advertisement -

ఆపదలో ఉన్న వారికి అండగా నేనున్నా అనే భరోసానిచ్చే మంత్రి కేటీఆర్ మరోసారి మంచిమనసు చాటుకున్నారు. విజ‌య‌వాడ‌లో ఓ యువ‌తి కొవిడ్ భారిన ప‌డి ఆస్ప‌త్రిలో చేరింది. త‌మ సోద‌రి స్థితిని వివ‌రిస్తూ యువ‌కుడు రెమ్‌డెసివిర్ డ్ర‌గ్ కావాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ట్విట్ట‌ర్ ద్వారా విన్న‌వించాడు.

దీనిపై త‌క్ష‌ణం స్పందించిన మంత్రి కేటీఆర్ త‌న స్నేహితుడు, ఏపీ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీశాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ మీకు స‌హాయం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ సూచ‌న మేర‌కు ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ బాధితుల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని వెంట‌నే అందించారు. దీనిపై బాధితుడు స్పందిస్తూ ఇరు రాష్ట్రాల మంత్రుల‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

- Advertisement -