రంగారెడ్డి జిల్లా నార్సింగిలో టీ డయాగ్నోస్టిక్ హబ్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ, ఒకప్పుడు ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఉస్మానియా, గాంధీతోపాటు పీహెచ్సీలకు వెళ్లేవారన్నారు. బస్తీ ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో విప్లవాత్మకమైన చర్యలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. బస్తీల్లోని నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామన్నారు.
రక్త, మూత్ర, ఎక్స్రేతో పాటు ఇతర పరీక్షల నిమిత్తం ప్రభుత్వం టీ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశారన్నారు. టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఇప్పటికే 24.71 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. ఇప్పుడు టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉచితంగా 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్లో టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో 137 రకాల పరీక్షలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. టీ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ల కోసం టీ డయాగ్నోస్టిక్ మొబైల్ యాప్ను ఆవిష్కరించామని తెలిపారు. ఈ యాప్ ద్వార వైద్య పరీక్షల ఫలితాలను ఎప్పుడైనా తెలుసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్లో 20 రేడియోలజీ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. అందులో భాగంగా ఈ రేడియోలజీ ల్యాబ్ ను నార్సింగ్లో ప్రారంభించాం అన్నారు. ఈ రేడియోలజీ ల్యాబ్ ద్వారా ఎక్స్రే, అల్ట్రా సౌండ్, 2డీ ఎకో, మెమోగ్రఫీ సేవలను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. పెరిగిన అవసరాల మేరకు నగరంలో 4 కొత్త ఆస్పత్రులు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇక పై ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే లివర్, కిడ్నీ, లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలతో పాటు ఉచితంగా మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్స అందిస్తున్నామని హరీశ్రావు స్పష్టం చేశారు.