- Advertisement -
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలిచింది మజ్లిస్. డీఎంసీ ఎన్నికల్లో 15 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది. పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.
గుజరాత్కు, ఢిల్లీలోని సీలంపూర్నకు పెద్ద తేడా ఏమీలేదని, రెండు చోట్లా అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కనీసం స్కూళ్లు సరిగ్గా లేవన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ను చోటా రిచార్జ్తో పోల్చిన ఓవైసీ…. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కోసం ఏ ఒక్కరూ పనిచేయడం లేదని ఆరోపించారు. కొత్తగా స్కూళ్లు నిర్మించలేదని, పరిభ్రత కూడా అంతంత మాత్రంగా ఉందని చెప్పారు.
గుజరాత్ అసెబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. గుజరాత్లో మొత్తం 14 సీట్లలో బరిలో నిలవగా ఇందులో 12 నియోజకవర్గాల్లో ముస్లింలకే సీట్లు కేటాయించింది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -