14 సంవత్సరాల్లో తొలిసారి బగ్గుమన్న అగ్గిపెట్టె ధర..

203
- Advertisement -

ఇప్పుడు అగ్గి పుల్ల కూడా సామన్యుడి జేబును కాల్చేయడానికి సిద్దమైంది. పాల నుంచి పెట్రోల్ దాకా అన్నీ ప్రియమైపోగా, తానేం తక్కువ మండిపోనంటూ అగ్గి పెట్టె ధర రెండింతలు కానుంది. అవును, ఇన్నాళ్లూ 1రూపాయికే దొరికిన మ్యాచ్ బాక్స్ ఇకపై 2రూపాయలకు తక్కువ రానంటోంది. అగ్గి పెట్టె ధరలు 14 ఏళ్ల తరవాత పెరగనున్నాయి. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి అగ్గి పెట్టెను రూ.2 చొప్పున విక్రయిస్తామని తయారీ సంస్థల సమాఖ్య ‘ఆలిండియా ఛాంబర్ ఆఫ్ మ్యాచెస్’ ప్రకటించింది. అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించే 14 రకాల ముడి పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణం. అగ్గిపుల్ల తయారీలో వినియోగించే రెడ్‌ఫాస్ఫరస్, మైనం, బాక్స్ బోర్డులు, పేపర్, పొటాషియం క్లోరేట్, గంధకం వంటి వాటి ధరలు పెరగడంతో అగ్గిపెట్ట ధర పెంచక తప్పడం లేదని తయారీదారులు పేర్కొన్నారు.

అగ్గిపెట్టె తయారీదార్లకు సంబంధించి 5 సంఘాలు శివకాశీలో సమావేశమై ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నాయి. కాగా, చివరిసారి 2007లో అగ్గిపెట్టె ధరను పెంచారు. అప్పట్లో రూ. 50 పైసలు ఉన్న అగ్గిపెట్టె ధరను రూపాయికి పెంచారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ ధరను రెట్టింపు చేశారు. ప్రస్తుతం 600 అగ్గిపెట్టెలు ఉన్న బాక్స్‌ను రూ. 270-300 మధ్య విక్రయిస్తుండగా, తాజా నిర్ణయంతో దీని ధర రూ. 430-480కి పెరగనుంది. ఈ మేరకు నేషనల్ స్మాల్ మ్యాచ్‌బాక్స్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ కార్యదర్శి వి.ఎస్. సేతురథినమ్ తెలిపారు. ఈ ధరకు 12 శాతం జీఎస్టీ, రవాణా చార్జీలు అదనమని తెలిపారు.

- Advertisement -