KTR:నల్గొండ సభకు తరలిరండి

21
- Advertisement -

తెలంగాణ జల హక్కులను కృష్ణాబోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ 13న నల్లగొండలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నామని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.సనత్‌నగర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్… తెలంగాణ సర్కారు ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరాశజనకంగా ఉందన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు రూ.1.25 లక్షల కోట్లు అవసరమవుతాయని, కానీ బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ.53 వేల కోట్ల మాత్రమే కేటాయించారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్నాడని…ప్రతి కరెంటు మీటర్‌కు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్‌ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Also Read:పిక్ టాక్ : అందాల దుకాణం ఓపెన్‌ చేసింది

- Advertisement -