KTR: ప్రాణం పోయినా ప్రజల కోసం పోరాటం ఆపం

6
- Advertisement -

ప్రాణం పోయినా ప్రజల కోసం పోరాటం ఆపమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో మాట్లాడిన కేటీఆర్… నన్ను, మా బీఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కోలేక.. చేతుల్లో అధికారం ఉందని మా గొంతును నొక్కడానికి మా కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని రేవంత్ అనుకుంటున్నాడు…చావుకు తెగించి వచ్చిన వాళ్లం.. వెనక్కి తగ్గం.. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతూనే ఉంటాం అని తేల్చిచెప్పారు.

కేసులు, ప్రభుత్వాల కుట్రలు మాకు కొత్త కాదు… రేవంత్ అక్రమాలు, అవినీతి, వైఫల్యాలు ఎత్తి చూపినందుకే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఎలాంటి చట్టవిరుద్ద కార్యక్రమాలు లేకున్నా ప్రభుత్వ కుట్రతోనే మాపై దుష్ప్రచారం, రాజకీయ కుట్రలు చేస్తున్నారన్నారు. పదకొండు నెలలుగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది… బీఆర్ఎస్ నేతలు రాజీ లేకుండా పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ నేర్పిన ఉద్యమబాటలో బీఆర్ఎస్ నేతలు నడుస్తున్నారు అన్నారు.

సివిల్ సప్లైస్ స్కాం, మూసీ స్కాం వంటి అన్ని రకాల రేవంత్ అక్రమాలు, అవినీతి, వైఫల్యాలు ఎత్తి చూపినందుకే అక్రమ కేసులు పెడుతున్నారు… నిన్నటి నుంచి ఒక ప్రహాసనం లాగా మాపై కుట్ర నడిపే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. తెలంగాణలో ఒక కుటుంబం, దీపావళికి ఇంట్లో దావత్ చేసుకోవడం తప్పా? దాని కోసం కూడా అనుమతి తీసుకోవాలా చెప్పాలన్నారు.

రాజ్ పాకాల ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేశాడు, దాని కోసం ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులతో ఫ్యామిలీ పంక్షన్ చేసుకున్నారు… అలాంటి కుటుంబ కార్యక్రమాన్ని రేవ్ పార్టీ అంటూ కొంత మంది పైశాచిక ఆనందం పొందుతున్నారు అన్నారు. నేను అక్కడ లేకున్నా నా పేరుతో అడ్డగోలుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు… ప్రజా జీవితంలో ఉంటే మాపై ఏలాంటి మాటలైనా, అడ్డగోలు ప్రచారం చేయవచ్చా? చెప్పాలన్నారు. అది రాజ్ పాకాల ఇల్లు, ఫాం హౌజ్ కాదు, కుటుంబ సభ్యులను పురుషులు, మహిళలు అంటూ చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు… ఈ 21 గంటలు పరిశోధించి పట్టుకున్నది ఏంటీ? అక్కడ ఏం లేదని చాలా స్పష్టంగా అధికారులే డ్రగ్స్ దొరకలేదని చెప్పారు, అయినా ఏందుకీ దుష్ప్రచారం అన్నారు. కేసు అధికంగా మద్యం ఉన్న కేసు అని.. అబ్కారీ కేసు అని చెబితే మళ్లీ నార్కోటిక్ కేసు అంటున్నారు…కేవలం పైవారి ఆదేశాల మేరకు మాత్రమే నార్కోటిక్ కేసు అంటున్నారు అన్నారు.

Also Read:స్కిల్ వర్సిటీకి మెఘా కంపెనీ విరాళం

అక్కడ పార్టీలోకి చేరి అనేక మందికి టెస్టులు చేస్తే రాజ్ పాకాలకు టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది, అయినా ఆయనను బిజెపి, కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అన్నారు. అయినా ఎన్డీపీఎస్ కేసు ఎలా పెడతారు? ఉదయం ఇచ్చిన పంచనామాకి, ఎఫ్‌ఐఆర్ కి తేడా ఎలా వచ్చింది… బాంబులు అని చెప్పి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు అన్నారు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా పోరాటాన్ని ఆపం, రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం… మీరిచ్చిన హమీల నెరవేర్చకపోవడం, ప్రజలను మోసం చేయడం వంటి అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ వెంటపడతాం అని తెలిపారు.

- Advertisement -