మొక్కలు నాటిన ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌ సిబ్బంది…

76
gic
- Advertisement -

జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఖమ్మం జిల్లాప్రభుత్వ హాస్పిటల్ నందు మొక్కలు నాటిన ఆయుష్ డాక్టర్స్. మెడికల్ సూపరిటిండెంట్ డాక్టర్‌ బీ.వెంకటేశ్వరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డైటిషియన్ మేరీ సూర్యపోగు, డాక్టర్ వెంకన్న, శ్రీనివాస్, కెల్విన్ జన్సీరాం, శ్వేత అనిత, శిరీష తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి కన్నతల్లి లాంటిది… కన్నతల్లి ని ఎలా ప్రేమగా చూసుకుంటామో అదే విధంగా మనం ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. పర్యావరణ పరిరక్షిద్దాం రాబోయే భావితరాలను రక్షించుకుందాం. భవిష్యత్‌ తరాలకు మంచి వాతావరణం అందించేందుకు మనందరం కృషి చేయాలని కోరారు.ఇంత గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యులను చేసినందుకు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -