KTR:కేసీఆరే మళ్లీ సీఎం

39
- Advertisement -

ప్రజలంతా మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసిఆర్ నాయకత్వంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ది చెందాయన్నారు. ప్రజలు ఎక్కడ సభ పెట్టిన లక్షల మంది వస్తున్నారని…మళ్ళీ అధికారంలోకి వచ్చాక మహిళలకి పెద్ద పీట వేయబోతున్నాం అన్నారు. మాది పేదల ప్రభుత్వం అని…ఈ తోమిదిన్నరెళ్ళలో ఎక్కడ కూడా గొడవలు జరజలేదు అన్నారు. అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళ్ళాం అని…కూకట్ పల్లి ఎమ్మెల్యేను ఈ సారి అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్‌ని గెలిపించాలన్నారు.

ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే చిల్లర మాటలని గమనించాలని…రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు…దొరల తెలంగాణ కు, ప్రజల తెలంగాణ పోటీ అని రాహుల్ అంటున్నారని మండిపడ్డారు. నిజమే ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే పోటీ ఇది అని…మీ తాత నెహ్రూ బలవంతంగా ఆంధ్రలో కలిపాడు…1956 లో ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది…ఇలా కలపటం వల్ల 56 యేళ్లు గోస పడ్డదన్నారు. రాహుల్ గాంధీ నాయనమ్మ వల్ల వందల మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారని…ఢిల్లీ దొరల కారణంగా వేల మంది బలిదానం చేసుకున్నారన్నారు.

Also Read:Harishrao:మెదక్‌లో గులాబీ జెండా ఎగరాలి

అనివార్యంగా తర్వాతత తెలంగాణ ఇస్తామని ప్రకటన చేశారు…అప్పుడు కాంగ్రెస్ దొరలతో,ఇప్పుడు మరో మోడీ బీజేపీ దొర తో పోరాడుతున్నాం అన్నారు. మీ ఢిల్లీ అహంకారానికి తెలంగాణ తల వంచదు, దించదని…ఓటు కు నోటుకు దొంగ పక్కన పెట్టుకొని రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడుతున్నారన్నారు. ఎవడెవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే వ్యక్తి రాహుల్ గాంధీ అని…చిల్లరగాల్లకు పదవులు ఇచ్చే రాహుల్ గాంధీ మాకు నీతులు చెప్పనవరసరం లేదు అన్నారు.

- Advertisement -