Harishrao:మెదక్‌లో గులాబీ జెండా ఎగరాలి

40
- Advertisement -

ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అన్నారు మంత్రి హరీశ్ రావు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన..మెదక్ కు, మన పార్టీకి ముఖ్యమైన ఎన్నికలు. భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. భవిష్యత్ నిర్ణయించే ఎన్నిక ఇది అన్నారు. అందర్నీ కలుపుకొని పోవాలి. మంచి కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. 22 ఏళ్ల అనుబంధం మనదన్నారు.పదేళ్ల కింద పపన్నపేట ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అందరూ ఆలోచించాలన్నారు.

ఎరువులకు, నీళ్లకు, కరెంట్ కు ఎన్ని కష్టాలు పడ్డాము గుర్తు ఉండే ఉంటుందని…సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. ఎమ్మెల్యే పద్మ ప్రజల్లో ఉండి, నియోజక అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అని…మన ఎమ్మెల్యేగా కూడా మన పార్టీ వాళ్ళు ఉంటే ఇంకా బాగా అభివృద్ది చేసుకోవచ్చు అన్నారు.హైదరాబాద్ నుండి బెంజ్ కారులో వచ్చి ఆత్మగౌరవం గురించి మాట్లాడటం నమ్ముతారా అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ఏమన్నడు రైతు బంధు బిచ్చం వేస్తున్నాం అన్నడు…ప్రతి రైతుకూ 15 వేలు అని కుట్ర చేస్తున్నది కాంగ్రెస్. ఎన్ని ఎకరాలు ఉన్నా 15 వేలే ఇస్తారు.కెసిఆర్ ప్రతి ఎకరాకు 16 వేలు అంటే, కాంగ్రెస్ ప్రతి రైతుకు 15 వేలు అంటున్నది. ప్రజలు ఆలోచించాలన్నారు. బి ఆర్ ఎస్ గెలిచాక ఆసరా పింఛన్లు 5వేలు చేయబోతున్నాం అని… ఆరోగ్య శ్రీ ద్వారా 15 లక్షల చికిత్స ఉచితంగా అందించబోతున్నాం అన్నారు. మెదక్ లో గులాబీ జెండా ఎగరాలి…మంచి మెజారిటీతో ఎమ్మెల్యే పద్మని గెలిపించాలన్నారు.

Also Read:డబుల్ ఇస్మార్ట్ .. సిక్స్ ప్యాక్ లో రామ్

- Advertisement -