JDU:బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి

8
- Advertisement -

బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది జేడీయూ. ఇవాళ బిహార్‌లో పార్టీ కార్యవర్గ సమావేశం జరుగగా జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సంజయ్‌ జాని నియమించింది. ఈ సందర్భంగా బీహార్‌ ఆర్థికంగా, అభివృద్ధిలో వెనుక ఉండటాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని, దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్‌ను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్ర‌త్యేక హోదాను బీహార్‌కు ఇవ్వాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీర్మానం చేశారు. బీహార్ రాష్ట్ర వృద్ధికి ప్ర‌త్యేక ప్యాకేజీ అవ‌స‌ర‌మ‌న్నారు. బీహార్‌లో ఇటీవల 65 శాతానికి పెంచిన రిజర్వేషన్ కోటాను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

Also Read:దనియాల కషాయం..ఉపయోగాలు!

- Advertisement -