చాలామందికి ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత అరటిపండు తినే అలవాటు ఉంటుంది. కొందరైతే సమయాభావం లేకుండా అరటిపండు తింటూ ఉంటారు. అరటిపండు తినడం వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధి గ్రస్తులు దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో సహజంగానే చక్కెర శాతం అధికంగా ఉంటుంది కాబట్టి కాబట్టి మధుమేహ తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది.
అరటిపండును ఉదయం తినవచ్చా? రాతిపూట తింటే మంచిదా? అనే అనుమానాలు చాలామందిలో వస్తుంటాయి. అరటిపండ్లను ఉదయం లేదా సాయంత్రం తీసుకోవడం చాలా మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం అల్పాహారం సమయంలో అరటిపండును తీసుకోవడం మరింత మంచిదని సూచిస్తున్నారు.
అయితే, రాత్రి పూట మాత్రం అరటిని తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు. రాత్రిపూట జీవక్రియ అత్యల్పంగా ఉంటుందని.. ఇందులోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం నిద్రను నియంత్రించే సెరోటోనిన్ అనే పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తుందని వెల్లడిస్తున్నారు. కొంతమంది పరగడుపున లేదా ఎలాంటి ఆహారం తీసుకోకముందు అరటిపండును తింటారు. అయితే, ఇలా తినడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. అరటిలో ఆమ్ల స్వభావం కలిగి ఉంటుందని.. ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ఒత్తిడిని కలిగిస్తాయని చెబుతున్నారు.
Also Read:TTD: 25న కోయిల్ అల్వార్ తిరుమంజనం