దేశంలో కొత్తగా 25,166 క‌రోనా కేసులు..

198
- Advertisement -

గత కొద్దిరోజులుగా దేశంలో కోవిడ్ కొత్త కేసులు తగ్గుతున్నాయి. ఈ నెలలో థర్డ్ వేవ్ వస్తుంది అని నిపుణులు చెప్పుతున్న సమయంలో ఇలా తక్కువ కేసులు రావడం మంచిదే అంటున్నారు. సోమవారం దేశంలో క‌రోనా కొత్త‌ కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. గత 24 గంటల్లో 25,166 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. ఇంత త‌క్కువ‌గా కొత్త కేసులు న‌మోదు కావ‌డం 154 రోజుల్లో ఇదే తొలిసారి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,22,50,679కు చేరింది.అలాగే కొత్తగా క‌రోనా నుంచి 36,830 మంది కోలుకున్నారు.

24 గంటల్లో 437 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,32,079 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,14,48,754 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 146 రోజుల క‌నిష్ఠ స్థాయికి చేరుకుంది. 3,69,846 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 55,47,30,609 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు. రిక‌వ‌రీ రేటు 97.51 శాతంగా ఉంది.

- Advertisement -