దేశంలో 24 గంటల్లో 12,286 మందికి కరోనా..

131
corona
- Advertisement -

దేశంలో కొవిడ్‌ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు 16వేల వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 12వేల లోపు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 12,286 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 12,464 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,24,527కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 91 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,248కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,98,921 మంది కోలుకున్నారు. 1,68,358 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,48,54,136 మందికి వ్యాక్సిన్ వేశారు.

- Advertisement -