రాష్ట్రంలో కొత్త‌గా 163 కరోనా కేసులు నమోదు..

122
ts corona
- Advertisement -

తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్త‌గా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 157 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం కరోనా కేసుల వివరాల వెల్లడించింది.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,086కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,95,544 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1635 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,907 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 774 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 27 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

- Advertisement -