దేశంలో కొత్తగా 68,020 కరోనా కేసులు..

159
corona
- Advertisement -

దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది వాటి ప్రకారం… గ‌త 24 గంటల్లో 68,020 మందికి కరోనా నిర్ధారణ అయింది. 32,231 మంది కోలుకున్నారు. అదే సమయంలో 291 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,61,843కు పెరిగింది.

దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,39,644కు చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకు 1,13,55,993 మంది కోలుకున్నారు. 5,21,808 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,05,30,435 మందికి వ్యాక్సిన్లు వేశారు.

- Advertisement -