రాష్ట్రంలో కొత్తగా 403 మందికి కరోనా..

267
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది వారాల నుండి కరోనా కేసలు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం…గత 24 గంటల్లో కొత్త‌గా 403 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 313 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,742 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,00,469 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,690గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 4,583 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,815 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 146 మందికి క‌రోనా సోకింది.

- Advertisement -