1270కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య…

179
omicron
- Advertisement -

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తాజాగా వెయ్యి మార్క్ దాటి 1270కి చేరాయి ఒమిక్రాన్ కేసులు. మహారాష్ట్రలో 450, ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్‌లో 97, రాజస్థాన్‌ 69, తెలంగాణలో 62, తమిళనాడులో 46, కర్ణాటకలో 34, ఆంధ్రప్రదేశ్‌లో 16 నమోదయ్యాయి.

మొన్నటి వరకు డెల్టా వేరియంట్‌తోనే సతమతమవుతున్న ప్రజలకు ఇప్పడు ఒమిక్రాన్ మరింత భయాన్ని రేపుతోంది. డెల్టా వేరియంట్‌ కంటే 6 రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడంతో పలు రాష్ట్రాలు న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాయి. మరి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్‌ కర్ఫ్యూ అమలులో ఉంది. ప్రతి ఒక్కరూ కోవిడ్‌పై అప్రమత్తంగా ఉండాల్సి ఆరోగ్య శాఖ సూచించింది.

- Advertisement -