10 లక్షల 38 వేలకు చేరిన కరోనా కేసులు..

166
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి వేల సంఖ్యలో పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 34,884 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 671 మంది మృత్యువాతపడ్డారు.

ఇక ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షల 38 వేల 716కు చేరగా 3 లక్షల 58 వేల 692 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి నుండి 6 లక్షల 53 వేల 751 మంది కోలుకోగా 26,273 మంది మృతిచెందారు.

ఇప్పటివరకు 1.34 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ఐసీఎమ్మార్‌) తెలిపింది. నిన్న ఒక్కరోజే 3,61,024 మందికి పరీక్షలు చేశామని వెల్లడించింది.

- Advertisement -