స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..

26
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 6,660 కేసులు నమోదుకాగా 24 మంది మృతిచెందారు. తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.49 కోట్లకు చేరగా ప్రస్తుతం దేశంలో 63,380 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కరోనాతో ఇప్పటివరకు 5,31,369 మంది మృతిచెందగా 4,43,11,078 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.14 శాతం యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.67 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశారు.

Also Read:IPL 2023:హైదరాబాద్ ఓటమి

- Advertisement -