11 లక్షల 55 వేలకు చేరిన కరోనా కేసులు..

200
coronavirus cases
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటాయి. రోజుకు దాదాపు 35 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 37,148 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 587 మంది మృత్యువాతపడ్డారు.

ఇక దేశంలో ఇప్పటివరకు 11 లక్షల 55 వేల 191 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 28,084 మంది ప్రాణాలు కొల్పోయారు. దేశంలో ప్రస్తుతం 4,02,529 కేసులు ఉండగా 7,24,578 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 3,18,695 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 12,030 మంది చనిపోయారు. తమిళనాడులో 1,75,678 కేసులు, ఢిల్లీలో 1,23,747 కేసులు, కర్ణాటకలో 67,420 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -