శ్రీశైలంకు కొనసాగుతున్న వరద…

183
Srisailam
- Advertisement -

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

ఇన్‌ ఫ్లో 1,07,316 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 38,140 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా… ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 68.7145 టీఎంసీలుగా ఉంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం 844.20 అడుగులకు చేరింది.

- Advertisement -