దేశంలో 83 లక్షలు దాటిన కరోనా కేసులు..

199
covid
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24గంటల్లో దేశంలో 46,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 514 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 83,13,877కు చేరగా 1,23,611 మంది మృతిచెందారు.

ప్రస్తుతం దేశంలో 5,33,787 యాక్టివ్‌ కేసులుండగా ఇప్పటివరకు 76,56,478 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 12,09,609 టెస్టులు చేయగా ఇప్పటి వరకు 11,29,98,959 నమూనాలను పరిశీలించినట్లు తెలిపింది.

- Advertisement -