76 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

203
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 55,722 కొత్త కేసులు నమోదు కాగా .. 579 మంది మృతిచెందారు. ఇక ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 75,50,273కు చేరగా ప్రస్తుతం దేశంలో 7,72,055 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కరోనాతో ఇప్పటివరకు 1,14,610 మంది మృతిచెందగా 66,63,608 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో 66,399 మంది రికవరీ అయ్యారు.

దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 88.26 శాతంగా ఉండగా యాక్టివ్ కేసుల శాతం 10.23గా ఉంది. ఇక, మృతుల సంఖ్య 1.52 శాతానికి తగ్గిపోయింది. ఇప్పటి వరకు 9,50,83,976 శాంపిల్స్ పరీక్షించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -