టీఆర్ఎస్‌ ప్రభుత్వం పేదల ప్రభుత్వం: మంత్రి మల్లారెడ్డి

222
mallareddy
- Advertisement -

ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు మంత్రి మల్లారెడ్డి. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్‌ డివిజన్‌లో మొన్న కురిసిన భారీ వర్షాలతో ఫిట్స్‌ (మూర్ఛ)తో నాలాలో పడి మృతి చెందిన మహమ్మద్‌ సమీద్‌ కుటుంబానికి రూ.5లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు మంజూరు కాగా దానిని బాధిత కుటుంబానికి అందజేశారు మల్లారెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడిన మల్లారెడ్డి …చిన్న వయసులోనే సమీద్‌ మృతి చెందడం బాధాకరమన్నారు. ఆపదలో ఉన్నవారికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

సీఎం కేసీఆర్‌ ఈ విషయంపై దిగ్భ్రాంతి చెంది, వెంటనే కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో రూ.5లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆదేశించారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకుంటామన్నారు.

- Advertisement -