దేశంలో 67 లక్షలు దాటిన కరోనా కేసులు..

270
india corona cases
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24గంటల్లో 61,267 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 884 మంది చెందారు.

దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 66,85,083కు చేరగా 9,19,023 యాక్టివ్‌ కేసులున్నాయి. 56,62,491 మంది బాధితులు కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

కరోనాతో ఇప్పటివరకు 1,03,569 మంది మృతి చెందగా నిన్న ఒకే రోజు 10,89,403 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు టెస్టుల సంఖ్య 8,10,71,797కు చేరాయి.

- Advertisement -