ఆస్ట్రేలియాపై భారత్‌ గెలుపు..

238
india
- Advertisement -

క్యాన్‌బెరాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో భారత్‌ గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత పోరాడింది. 11 పరుగల తేడాతో విజయం సాధించింది. 162 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల నష్టానికి 150 ర‌న్స్ చేసింది. బౌల‌ర్లు న‌ట‌రాజ‌న్‌, చాహాల్‌లు టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. ఆ ఇద్ద‌రూ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. జ‌డేజాకు గాయం కావ‌డంతో కాంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్‌గా బ‌రిలోకి దిగిన చాహ‌ల్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకున్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఓవ‌ర్ల‌లో 161 ర‌న్స్ చేసింది. ఆ త‌ర్వాత ఫీల్డింగ్‌లోనూ భార‌త్ త‌న స‌త్తా చాటింది. వాస్త‌వానికి చేజింగ్‌ను ఆస్ట్రేలియా ధాటిగా ప్రారంభించినా.. చాహాల్‌, న‌ట‌రాజ‌న్‌లు కీల‌క ద‌శ‌ల్లో వికెట్లు తీశారు. ర‌వీంద్ర జ‌డేజా బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించ‌గా.. అత‌ని స్థానంలో స‌బ్‌స్టిట్యూట్‌గా వ‌చ్చి బౌలింగ్ వేసిన చాహాల్ కూడా రాణించ‌డం విశేషం. టీమిండి యాను తన బౌలింగ్ మయాజాలంతో గెలిపించాడు.

స్కోరు బోర్డు
ఇండియా 161/7 (కేఎల్ రాహుల్ 51, ర‌వీంద్ర జ‌డేజా 44 నాటౌట్‌)
ఆస్ట్రేలియా 150/7 (షార్ట్ 34, ఫించ్ 35, హెన్రిక్స్ 30, చాహ‌ల్ 3-25, న‌ట‌రాజ‌న్ 3-30)

- Advertisement -