75 లక్షలు దాటిన కరోనా టెస్టులు..

178
covid 19
- Advertisement -

దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు దేశంలో 75 లక్షల కరోనా టెస్టులు చేసినట్ల ఐసీఎంఆర్ వెల్లడించింది. ఒక్కరోజే 2, 07, 871 నమూనాలకు పరీక్షలు నిర్వహించామని….ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 75, 60, 782 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది ఐసీఎంఆర్.

గడచిన 24 గంటల్లో అత్యధికంగా 16, 922 పాజిటివ్ కేసులు నమోదు కాగా 418 మంది మృతి చెందారు. ఇక దేశంలో కరోన బాధితుల సంఖ్య 4, 73, 105 కి చేరగా 1,86, 514 మందికి చికిత్స కొనసాగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 95,26,495కి చేరింది. గత 24 గంటల్లో ఈ వైరస్‌ వల్ల 5వేలకు పైగా బాధితులు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 4,84,960కు పెరిగింది. ఇప్పటివరకు కరోనా బారినపడినవారిలో 51,75,319 మంది కోలుకోగా, మరో 38,07,790 మంది చికిత్స పొందుతున్నారు.

- Advertisement -