ఒక్కరోజే 16వేల కేసులు…418 మంది మృతి

162
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 16, 922 పాజిటివ్ కేసులు నమోదు కాగా 418 మంది మృతి చెందారు. ఇక దేశంలో కరోన బాధితుల సంఖ్య 4, 73, 105 కి చేరగా 1,86, 514 మందికి చికిత్స కొనసాగుతోంది.

కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 2, 71, 696 మంది బాధితులు కొలుకోగా…..కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 14, 894 మంది మృతి చెందారు.నిన్న ఒక్కరోజే కోలుకున్న 13, 011 మంది బాధితులు కొలుకున్నారు.

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాల్లో కరాళ నృత్యం చేస్తున్నది. ఇప్పటివరకు అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదైన అమెరికా, బ్రెజిల్‌లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. అమెరికాలో నిన్న ఒక్కరోజే 39 వేల కొత్తకేసులు నమోదవగా, బ్రెజిల్‌లో 41 వేల కేసులు రికార్డయ్యాయి.

- Advertisement -