ఆస్పత్రిలో ప్రభాస్‌..ఏమైంది ?

16
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది . దీంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మెరుగైన చికిత్స కోసం ప్రభాస్ విదేశాలకు వెళ్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. దీంతో ప్రభాస్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు ప్రభాస్‌కు ఏమైంది అని ఆరా తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మొత్తానికి రెబల్ స్టార్ ప్రభాస్ కి అనారోగ్యం అనే వార్త ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా కలవర పెడుతుంది. ఐతే, ప్రస్తుతం ప్రభాస్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ లేటెస్ట్ హెల్త్ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది ప్రభాస్ అభిమానులకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది ఈ వార్త. ఒకపక్క ప్రభాస్ ఇలా అనారోగ్యంతో ఉంటే.. మరోపక్క ప్రభాస్ పెళ్లి గురించి గాసిప్ లు వైరల్ అవుతున్నాయి.

అసలు ప్రభాస్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో రచ్చ చేయడం కొత్తేమి కాదు. అయితే ప్రభాస్, కృతీ సనన్‌ పెళ్లిపై వచ్చిన వార్తలన్ని రూమర్స్ అని తేలింది. దీనిపై మరోసారి కృతీ స్పందించింది. ఇదంతా వరుణ్‌ ధావన్‌ వల్లే జరిగిందని అతను ఓ ఇంటర్వ్యూలో పుకారు సృష్టించడానికి ఇలా మాట్లాడడని, అతను చేసిన పనికి నాకు విషెస్ చెప్తూ బోలెడు మెసేజ్‌లు వచ్చాయిని అందుకే మరోసారి మాట్లాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -