కరోనా ఔషధాలు, పరికరాలపై జీఎస్టీ తగ్గింపు..

273
Nirmala Sitharaman
- Advertisement -

శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు. సింగిల్ అజెండాతో జీఎస్టీ మండలి సమావేశం జరిగిందని తెలిపారు. కరోనా ఔషధాలు, పరికరాలపై పన్నులు తగ్గించినట్టు చెప్పారు.

జీఎస్టీ మండలి నిర్ణయాలు ఇవే..

– రెమ్ డెసివిర్ పై 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గింపు.
– వ్యాక్సిన్, టెంపరేచర్ కొలిచే పరికరాలపై 5 శాతం జీఎస్టీ యథాతథం.
– అంబులెన్సులపై 28 నుంచి 12 శాతానికి జీఎస్టీ తగ్గింపు.
– శ్మశాన వాటికల్లో వినియోగించే ఎలక్ట్రిక్ ఫర్నెస్ (విద్యుత్ ఆధారిత దహన వేదిక)లపై 5 శాతం జీఎఈస్టీ తగ్గింపు
– హ్యాండ్ శానిటైజర్లపై జీఎస్టీ కుదింపు.
– టోసిలిజుమాబ్, బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లపై జీఎస్టీ మినహాయింపు.
– ఆక్సిజన్ యూనిట్లు, టెస్టింగ్ కిట్లు, పల్స్ ఆక్సీమీటర్లపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింపు.
– ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాలపై జీఎస్టీ తగ్గింపు.
-కొవిడ్ చికిత్సలో ఉపయోగించే 3 రకాల మందులపై జీఎస్టీ తగ్గింపు.

- Advertisement -