ఆదాయపన్నుదారులకు ఊరట..

192
ITR
- Advertisement -

పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి ఊరట కల్పించింది. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును పెంచింది. 2020-21 ఆర్థిక సంవత్సరం లేదా 2021-22 మదింపు సంవత్సరానికి ఐటీఆర్‌ దాఖలు చేయడానికి డిసెంబర్‌ 31వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్టు సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టు టాక్సెస్) గురువారం ప్రకటించింది. కరోనా వైరస్‌తో నెలకొన్న పరిస్థుతుల కారణంగా గతంలో సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -