పసిడి ప్రేమికులకు షాక్‌..!

281
gold
- Advertisement -

బంగారం ప్రేమికులకు షాక్. గత మూడు రోజులుగా తగ్గిన పసిడి ధర ఇవాళ మళ్లీ పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 120 పెరిగి రూ. 45,820 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 42,000 కు చేరింది. బంగారం ధరలు పెరగగా వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. కేజీ వెండి ధర రూ. 300 తగ్గి రూ. 69,400 కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.

- Advertisement -