వైసీపీ ఎంపీపై సీబీఐ కేసు..

166
ysrcp
- Advertisement -

వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు గట్టి షాక్ తగలింది. చెన్నై ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవిచంద్రన్ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదైంది. ఫోర్జరీ పత్రాలు పెట్టి బ్యాంకు రుణాలు పొందిన రఘురామ కృష్ణంరాజు‌ కంపెనీ రూ. 237 కోట్ల రుణాలను పక్కదారి పట్టించినట్లు సీబీఐకి రవిచంద్రన్‌ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది.

ఇంద్‌ భారత్ పవర్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్న ఎంపి రఘురామ కృష్ణమరాజు, ఇతర డైరెక్టర్లు కనుమూరు రమాదేవి, రాజ్ కుమార్ గంటా, దుంపల మధు సూదన రెడ్డి, నారాయణ ప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్ లపై సీబీఐ కేసు నమోదు చేసింది. మార్చి 23న సీబీఐకి ఫిర్యాదుచేశారు రవిచంద్రన్‌.

- Advertisement -