BJP: బీజేపీలో చేరిన గాలి జనార్దన్‌ రెడ్డి

19
- Advertisement -

మైనింగ్ కింగ్,కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డి సొంత గూటికి చేరారు. మాజీ సీఎం యడియూరప్ప,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేందర్ సమక్షంలో తన భార్య అరుణతో కలిసి బీజేపీలో చేరారు. అలాగే తన పార్టీ కేఆర్‌పీపీని బీజేపీలో విలీనం చేశారు.

మూడోసారి మోడీకి మద్దతిచ్చేందుకు బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. ఎలాంటి పదవులు ఆశీంచకుండా బీజేపీలో చేరానని తెలిపారు. ఈ సందర్భంగా గాలి దంపతులకు ఘన స్వాగతం పలికారు యడియూరప్ప.

మైనింగ్ కింగ్‌గా బళ్లారిలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో గాలి జనార్థన్ రెడ్డి పేరు తెలియని వారుండరూ. అయితే అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని 2011లో గాలిని అరెస్ట్ చేశారు. బళ్లారి, కొప్పళ, రాయచూర్‌, హావేరి జిల్లాల్లో గాలికి మంచి అనుచరగణం ఉంది.

Also Read:హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్

- Advertisement -