Ram Mandir:దేశమంతా దీపావళి

20
- Advertisement -

దేశం 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరగనుంది. రాముడు తన సింహాసనంపై కూర్చోనుండగా శ్రీరాముని ప్రతి భక్తుడు ‘జై శ్రీరాం’ అని వ్రాసి భగవంతుని సేవకు అంకితం కానున్నారు. రామ్ లల్లా అయోధ్యలోకి ప్రవేశించిన సందర్భంగా దీపాలను వెలిగించడంతో దేశమంతా ఇవాళ దీపావళిని జరుపుకోనుంది.

రాముడు యొక్క దివ్య ఉనికిని వివరిస్తూ శ్రీ మహాకాళేశ్వర్ ఉజ్జయిని దేవాలయం ఓ చిత్రాన్ని పోస్ట్ చేయగా కేదార్‌నాథ్ ఆలయ పుణ్యక్షేత్రం బోర్డు “మేరే రాఘవ” అనే క్యాప్షన్‌తో ప్రతిష్ఠించాల్సిన శ్రీరాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు.

ఇక దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో పూజలు నిర్వహించనుండగా ప్రజలంతా ఇళ్లలో దీపాలను వెలిగించనున్నారు. ఇక ఈ సంవత్సరం ఇదే తొలి దీపావళిగా భావిస్తున్నారు ప్రజలు.

Also Read:Ram Mandir:మోడీ అయోధ్య షెడ్యూల్

- Advertisement -