షిండే టార్గెట్ ఠాక్రే ఇమేజ్‌!

2
- Advertisement -

తన రాజకీయ వ్యూహాలకు ఆపరేషన్ టైగర్ అని పేరు పెట్టడం నుండి స్టేజ్‌పై దూకుడుగా మాట్లాడే శైలి వరకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఇటీవలి కాలంలో అనుసరిస్తున్న తీరు ఒక కొత్త చర్చకు దారితీసింది.షిండే పొలిటికల్ వ్యూహాలు ఆయన ప్రసంగాల తీరు బాల్ ఠాక్రే వ్యక్తిత్వాన్ని అనుకరించేలా ఒక పక్కా వ్యూహంతో సాగుతున్నట్లు కనిపిస్తోంది.

ఇతర పార్టీల నుండి వచ్చే వలసలు లేదా రాజకీయ వ్యూహాలకు బీజేపీ సాధారణంగా ఆపరేషన్ లోటస్ లేదా ఆపరేషన్ కమల్ అని పేరు పెడుతుంది. కానీ షిండే మాత్రం తన రాజకీయ వ్యూహాలకు, విస్తరణ చర్యలకు ఆపరేషన్ టైగర్ అని బ్రాండ్ ఇమేజ్ ఇచ్చుకున్నారు. అయితే ఈ పేరు యాదృచ్ఛికంగా పెట్టింది కాదు .దీని వెనుక ఒక స్పష్టమైన సందేశం ఉంది. శివసేన వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో షిండే మాట్లాడుతూ.. పులి మీ ముందే ఉంది….ఆపరేషన్ ఎప్పుడూ పులే చేస్తుంది అని ప్రకటించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల మొదటి రోజున, ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలు ఆయన ముందే నిరసన తెలుపుతున్న సమయంలో శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ షిండేకు ఒక పులి చిత్రాన్ని బహుమతిగా ఇచ్చారు. నిరసనల మధ్యే షిండే ఆ చిత్రాన్ని కొన్ని నిమిషాల పాటు చేతిలో పట్టుకుని నిలబడ్డారు. శివసేన అసలైన పులి ఇప్పుడు షిండేనే అని మీడియాకు…ప్రత్యర్థులకు సంకేతాలు పంపడానికే ఆయన అలా చేశారా? అన్న చర్చ జరుగుతోంది.

మరాఠీ అస్తిత్వానికి, దూకుడు హిందుత్వానికి ప్రతీకగా శివసేన పార్టీ స్థాపన నుండే బాల్ ఠాక్రే గర్జించే పులిని పార్టీ చిహ్నంగా ఎంచుకున్నారు. ఆయన నిర్భయ శైలి కారణంగా పార్టీ పోస్టర్లు, బ్యానర్లు మరియు వేదికలపై ఆయనను మరాఠా టైగర్ లేదా మరాఠా పులి అని పిలిచేవారు. సామ్నా (Saamna) పత్రిక కార్టూన్లు, సంపాదకీయాలలో కూడా ఆయన రాజకీయ ప్రత్యర్థులను వేటాడే క్రూరమైన పులిలాగా పార్టీని చిత్రీకరించేవారు. ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టకుండానే అధికారాన్ని శాసించగల ఆయన హోదా….సూటిగా మాట్లాడే ఆయన వాక్చాతుర్యం ఆయనను మహారాష్ట్ర “టైగర్”గా మార్చాయి. ఇప్పుడు ఇదే బాటలో నడుస్తున్నారు షిండే.

Also Read:వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా కునాల్

- Advertisement -