టీమిండియా రేసులో దేవ్‌దత్ పడిక్కల్!

0
- Advertisement -

శ్రీలంకతో జరగబోయే రాబోయే సిరీస్‌లోని తొలి టెస్ట్ కోసం భారత తుది జట్టు (లేయింగ్ ఎలెవెన్)లో దేవ్‌దత్ పడిక్కల్‌కు చోటు దక్కే అవకాశాల గురించి భారత జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ఇటీవల మాట్లాడారు. రెండు టెస్టుల సిరీస్‌కు ముందు శ్రీలంకతో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు మంచి ప్రతిభ కనబరిచింది. కేఎల్ రాహుల్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత్ అద్భుత ప్రదర్శనతో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి..సిరీస్‌కు ముందు శుభారంభం చేసింది.

ఈ మూడు రోజుల మ్యాచ్‌ పొడవునా స్టార్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పడిక్కల్ విశేషంగా రాణించి 164 బంతుల్లో 142 పరుగులు చేశాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంలో అతడి ప్రదర్శన అత్యంత కీలక పాత్ర పోషించింది.దీనిపై టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే మాట్లాడుతూ పడిక్కల్ ఆడిన తీరును కొనియాడారు. తొలి టెస్టులో అతను తుది జట్టులోకి వస్తాడా లేదా అనేది గాల్‌లోనే నిర్ణయిస్తామని తెలిపారు.

దేవ్‌దత్‌కు ఈ అవకాశం లభించింది..తన నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. మేము గాల్ చేరుకున్నాక పిచ్‌ను చూసి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అది తీసుకుంటాం. కానీ అతని వద్ద మంచి పరుగుల అనుభవం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి ఇప్పుడు అతను XI (తుది జట్టు)లోకి వస్తాడా లేదా అనేది గాల్‌లోనే నిర్ణయిస్తాం అని మ్యాచ్ అనంతరం బహుతులే చెప్పారు.

Also Read:పెద్ది యాదిలో… కేసీఆర్ కంట కన్నీరు

భారత్ – శ్రీలంక మధ్య సిరీస్‌లోని మొదటి టెస్ట్ ఆగస్టు 15 నుండి గాల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది.

- Advertisement -