Bandla Ganesh:బండ్ల పై క్రిమినల్‌ కేసు

19
- Advertisement -

కాంగ్రెస్ నేత, నిర్మాత బండ్ల గణేశ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూప్‌ చైర్మన్‌ నౌహిరా షేక్‌ ఫిర్యాదు మేరకు ఫిలింనగర్‌ పోలీసులు బండ్ల గణేశ్‌పై కేసు నమోదు చేశారు. ఐపీసీ 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. తన ఇంట్లో కిరాయికి ఉంటున్న బండ్ల గణేశ్… అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇంటిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

నౌహిరా షేక్‌ ఫిలింనగర్‌లోని తన ఇంటిని గణేశ్‌కు నెలకు రూ.లక్ష అద్దె చొప్పున కిరాయికి ఇచ్చారు. అయితే కొంతకాలంగా కిరాయి ఇవ్వకపోగా గుండాలతో తనను బెదిరిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు నౌహిరా షేక్.

ఇంటిని ఖాళీ చేయాలని అడిగినందుకు ఫిబ్రవరి 15న తనను బెదిరించారని, గుండాలు, రాజకీయ నాయకుల సహాయంతో తన ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read:రాయ్‌బరేలీ బరిలో రాహుల్..

- Advertisement -