‘ఇండియా’ కూటమిలో చీలిక?

2
- Advertisement -

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సిపిఎం జాతీయ కార్యదర్శి బేబీ తప్పుపట్టడంతో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో మళ్లీ విభేదాలు బయటపడ్డాయి. కేరళలో లెఫ్ట్ పార్టీల పట్ల కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తున్న శైలిని బేబీ బహిరంగంగా ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారాయి. కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై బేబీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సహా పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు.. కేరళలోని సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) కు బీజేపీతో రహస్య అవగాహన ఉందంటూ పదేపదే ఆరోపణలు చేయడంపై ఆయన మండిపడ్డారు.

రాజకీయ విభేదాల కారణంగానే తాను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలుసుకోలేకపోతున్నానని గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఎం.ఏ. బేబీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ వాదనను ప్రశ్నిస్తూ రాజకీయ ప్రత్యర్థి అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ బహిరంగంగానే కౌగిలించుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

పార్టీల హద్దులు దాటి అలాంటి స్నేహపూర్వక హావభావాలు ప్రదర్శించడం సాధ్యమైనప్పుడు జాతీయ స్థాయిలో ఒకే కూటమిలో భాగస్వాములుగా ఉన్న నాయకులకు దూరం పెట్టడానికి రాజకీయ విభేదాలను ఒక సాకుగా చూపకూడదని బేబీ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఐక్యతను బలోపేతం చేయాలనుకుంటే ‘ఇండియా’ కూటమిలోని అన్ని పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని బేబీ నొక్కిచెప్పారు. రాష్ట్ర స్థాయిలోని విభేదాలు జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టాలనే కూటమి యొక్క ప్రధాన లక్ష్యాన్ని దెబ్బతీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి భాగస్వామ్య పార్టీపై ఉందని ఆయన హితవు పలికారు.

Also Read:బియ్యంలో విషం..ఇలా చేస్తే!

- Advertisement -