ఫ్రాన్స్లో జరగబోయే జీ7 (G7) సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ కానున్నట్లు శనివారం వైట్ హౌస్ ధృవీకరించింది. నవంబర్ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన ట్రంప్ను కలవడానికి ఫిబ్రవరి 2025లో ప్రధాని మోదీ అమెరికా పర్యటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరు ప్రపంచ నేతలు ముఖాముఖిగా కలుసుకోవడం ఇదే మొదటిసారి.
ఫ్రాన్స్ భేటీలో ఇరు దేశాల నేతలు ప్రధానంగా వాణిజ్యం, ఇంధన రంగ సహకారం…హెచ్-1బీ (H-1B) వీసా విధానాలు, ప్రాంతీయ భద్రత మరియు పశ్చిమాసియా లో మారుతున్న పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చ జరుగుతుందా అని ప్రశ్నించగా అమెరికా సీనియర్ అధికారులు స్పందిస్తూ.. ఖచ్చితంగా వాణిజ్య ఒప్పందం ప్రస్తావనకు వస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో మేము ఉమ్మడి ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేశాము… గత ఏడాది కాలంగా భారతీయులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నాము అని తెలిపారు.
కొన్ని వారాల క్రితమే అమెరికా బృందం భారతదేశంలో పర్యటించింది. ఈ ఒప్పందంలో మరింత పురోగతి సాధించడానికి నేను వ్యక్తిగతంగా వచ్చే వారం భారత్కు వెళ్లనున్నాను. అమెరికా, భారత్ల మధ్య ఇంతకుముందెన్నడూ ఇలాంటి వాణిజ్య ఒప్పందం జరగలేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని కొన్ని తాజా విధానాల వల్ల మా కంపెనీలు అక్కడ వ్యాపారం చేయడం కొంత కష్టంగా ఉంది, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము అన్నారు.
జీ7 సదస్సు జూన్ 16 మరియు 17 తేదీల్లో ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరగనుంది. ఫ్రాన్స్ మరియు స్లోవాక్ రిపబ్లిక్ పర్యటనలు ఐరోపా మరియు జీ7 దేశాలతో భారతదేశం యొక్క సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని నేను నమ్ముతున్నాను అని ప్రధాని చెప్పారు.
Also Read:బియ్యంలో విషం..ఇలా చేస్తే!

