బియ్యంలో విషం..ఇలా చేస్తే!

6
- Advertisement -

సాధారణ బియ్యంలో హానికరమైన ఆర్సెనిక్ ఉండవచ్చని ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరించారు. దీనికోసం ఆయన ‘పార్‌బాయిలింగ్’ (సగం ఉడికించడం) తో కూడిన మల్టీ-స్టెప్ వంట పద్ధతిని సిఫార్సు చేస్తున్నారు. దాదాపు ప్రతి వంటింట్లోనూ ఉండే అత్యంత ముఖ్యమైన ఆహారపదార్థం (బియ్యం) గురించి వినియోగదారులను తీవ్రంగా హెచ్చరించారు. మనం సాధారణంగా ఉపయోగించే వంట పద్ధతులు మనల్ని ప్రమాదకరమైన రసాయన స్థాయిలకు గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

జూన్ 12న జిబ్ అట్కిన్స్ అనే నిపుణుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు. అందులో సాధారణ బియ్యం సంచులలో దాగి ఉన్న ప్రమాదాల గురించి వివరిస్తూ…మీరు తినే బియ్యంలో విషపూరితమైన ఆర్సెనిక్ నిండి ఉంది. ఇది చాలా పెద్ద సమస్య. ఎవరూ కూడా ఆర్సెనిక్‌ను తినాలని అనుకోరు అని హెచ్చరించారు.

జిబ్ ప్రకారం ఈ భారీ లోహం బియ్యంలో ఉండటం అనేది చిన్న ఆరోగ్య సమస్యేమీ కాదు. ఈ పదార్థాన్ని క్రమంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు మరియు మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని ఆయన గుర్తించారు. చాలా రకాల బియ్యంలో ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటుంది…ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్‌తో ముడిపడి ఉంది అని జిబ్ తన వీడియో శీర్షికలో రాశారు. అయితే ఆందోళన చెందుతున్న వీక్షకులకు ఆయన ఒక భరోసా కూడా ఇచ్చారు. కానీ కంగారు పడకండి. సైన్స్ ఆధారితంగా ఈ ఆర్సెనిక్‌ను 73 శాతం వరకు ఎలా తగ్గించవచ్చో ఇక్కడ చూద్దాం అన్నారు.

బియ్యంలో ఉండే అధిక రసాయన స్థాయిలను అరికట్టడానికి, జిబ్ ‘పార్‌బాయిలింగ్ విత్ అబ్జార్ప్షన్ మెథడ్’ అని పిలిచే ఒక మల్టీ-స్టెప్ వంట ప్రక్రియను ప్రదర్శించారు. రోజూ అన్నం తినే ప్రతి ఒక్కరూ ఈ పద్ధతిని అనుసరించాలని కోరుతూ…మీరు ఎక్కువగా అన్నం తిన్నా, లేదా అలా తినేవాళ్లు మీకు తెలిసినా, వారి ఆరోగ్యాన్ని మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ వీడియోను వారితో పంచుకోండి అని చెప్పారు.

మొదటి రౌండ్ క్లీనింగ్..ఈ ప్రక్రియ చల్లని, స్వచ్ఛమైన నీటితో ప్రారంభమవుతుంది. మొదటగా మీ బియ్యాన్ని మామూలు చల్లని ఫిల్టర్ నీటితో ఒకటికి రెండుసార్లు బాగా కడగాలి. ఇది బియ్యంపై ఉండే కొంత ఆర్సెనిక్‌ను తొలగిస్తుంది అని జిబ్ చెప్పారు.

బియ్యాన్ని కొన్ని నిమిషాలు పక్కన పెట్టి ఈలోగా స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెలో సరైన నిష్పత్తిలో నీటిని మరిగించాలి. మీరు ఒక వంతు బియ్యానికి నాలుగు వంతుల నీటిని ఉపయోగించాలి. ఉదాహరణకు నేను ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల నీటిని తీసుకున్నాను అని జిబ్ వివరించారు. బియ్యాన్ని కడిగి నీటిని వడకట్టిన తర్వాత వాటిని నేరుగా మరుగుతున్న నీటిలో వేయాలి. దీనిని పార్‌బాయిలింగ్ అంటారు. నీటి నుండి ఆర్సెనిక్‌ను తొలగించడానికి ఇదే అసలైన కీలకం. ఈ విధంగా బియ్యాన్ని 4 నిమిషాల పాటు ఉడికించాలి అని ఆయన చెప్పారు.

మొదటి నాలుగు నిమిషాల ఉడుకు పూర్తయిన తర్వాత ఆ నీటిని పూర్తిగా పారబోయాలి. ఆ తర్వాత స్టవ్ మీది నుండి గిన్నెను దించి, ఆ నీటిని పూర్తిగా వడకట్టండి. అన్నాన్ని ఒకసారి చల్లని నీటితో కడగండి. ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల చొప్పున మళ్లీ నీటిని చేర్చండి అని జిబ్ సూచించారు. ఆ తర్వాత గిన్నెను తిరిగి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. మూత పెట్టి, నీరంతా ఇంకిపోయే వరకు అన్నాన్ని ఉడికించాలి.

అన్నం ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఆరోగ్యకరమైన కొవ్వును జోడించాలని జిబ్ సిఫార్సు చేశారు. మొదటిది అన్నం ఉడికేటప్పుడు ఒక టీస్పూన్ కొబ్బరి నూనె కలపండి. కొబ్బరి నూనె జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మంచిదే కాకుండా ఇందులో MCTలు (మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్) పుష్కలంగా ఉంటాయి. ఇది అన్నంలోని కొంత భాగాన్ని రెసిస్టెంట్ స్టార్చ్‌గా మార్చడానికి సహాయపడుతుంది.

Also Read:రోజు పదివేల అడుగులు నడుస్తున్నారా?

రెండో చిట్కా రిఫ్రిజరేషన్‌పై ఆధారపడి ఉంటుంది. అన్నం వండటం పూర్తయిన తర్వాత దానిని కొన్ని గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టండి. ఆ తర్వాత దానిని చల్లగా తినండి. ఎందుకంటే అన్నాన్ని చల్లబరిచినప్పుడు, అది ‘రెసిస్టెంట్ స్టార్చ్‌’గా మారుతుంది అని జిబ్ వివరించారు. ఇలా అన్నంలో రెసిస్టెంట్ స్టార్చ్ శాతాన్ని పెంచడం వల్ల శరీరానికి గొప్ప జీవక్రియ మరియు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దీని అర్థం ఏమిటంటే, మీరు అన్నం నుండి చాలా తక్కువ క్యాలరీలను పొందుతారు. అలాగే ఈ రెసిస్టెంట్ స్టార్చ్ మీ పొట్టలోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడి, అవి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇది మీ శరీరం అంతటా అద్భుతమైన మార్పులను తెస్తుంది. ఈ అలవాటు శరీరంలో వాపులను తగ్గించడానికి, సెరటోనిన్ వంటి హార్మోన్ల ఉత్పత్తిని పెంచడానికి మరియు మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని జిబ్ ముగించారు.

ఈ సమాచారం కేవలం సోషల్ మీడియాలోని కంటెంట్ ఆధారంగా రూపొందించబడింది. కేవలం సమాచారం కోసం మాత్రమే మరియు నిపుణులైన వైద్యుల సలహాలకు ఇది ప్రత్యామ్నాయం కాదు.

- Advertisement -