కేంద్రంలో నేరస్థులున్నారు :సీపీఐ నారాయణ

125
narayana
- Advertisement -

సీపీఐ నాయకుడు నారాయణ కేంద్ర ప్రభుత్వం విధానాలపై మండిపడుతూ, మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర కేబినెట్‌లో నేరస్థులున్నారని అన్నారు. వారే ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్నారని అన్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలను అక్రమంగా మారుస్తూ తమ ప్రభుత్వాలుగా చెప్పుకుంటున్నారని అన్నారు. జార్ఖండ్‌ సీఎం ను పదవి నుంచి తప్పించాలని కేంద్రం శత విధాల ప్రయత్నించిందని ఆరోపించారు.

మోదీ పాలనలో దేశం అధోగతి పాలైందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, నిలదీసే ప్రత్యర్థులపై ఈడీ చే దాడులకు పురిగొల్పి భయాందోళనలకు గురి చేస్తుందని మండి పడ్డారు. లిక్కర్‌ స్కామ్‌లో కేసీఆర్‌ కుటుంబాన్ని ఇరికించాలని చూశారన్నారు. తన కార్పొరేట్‌ మిత్రులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని అన్నారు. దేశాన్ని దోచుకుంటున్న అదానీ జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలు ఐక్యం కావాలని నారాయణ పిలుపునిచ్చారు.

- Advertisement -