యుద్ధప్రాతిపదికన కాళేశ్వరం పూర్తి చేయాలి..

200
CM KCR
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప‌రిశీల‌న‌లో భాగంగా నేడు సీఎం కేసీఆర్ సుందిళ్ల బ్యారేజీ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల పరిశీలనతో పాటు నిర్మాణ పనులు సాగుతున్న తీరు.. ఇంజినీర్లు, అధికారులు ఏం చేస్తున్నారనే దానిపై ముఖ్యమంత్రి ప్రశ్నించారు. గ్రావిటీ, బ్యారేజీ పనుల్లో అక్కడక్కడా నెమ్మదిగా సాగుతున్నాయని.. వాటిని వేగవంతం చేయాలని కేసీఆర్ సూచించారు.

CM KCR

ఎట్టిపరిస్థితుల్లో మార్చి చివరినాటికి నిర్మాణ పనులన్నీ పూర్తిచేయాలని సాగునీటిశాఖ అధికారులు, వర్క్ ఏజెన్సీలను సీఎం ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. అక్కడక్కడా ఇంజినీర్లు, వర్క్ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు.

అనంతరం సుందిళ్ల బ్యారేజీ నుంచి గోలివాడ పంప్‌హౌస్‌కు కేసీఆర్ హెలికాప్టర్‌లో బయలుదేరారు. గోలివాడ నుంచి బయలుదేరి సాయంత్రం గంటలకు కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలోని తన నివాసానికి చేరుకొని రాత్రి బస చేస్తారు. పెద్దపల్లి జిల్లాలో దాదాపు గంట పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించి కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తారు.

- Advertisement -