KCR:ప్రజాసేవ చేస్తే..దాడులు చేస్తారా?

33
- Advertisement -

ప్రజలంతా హింసా రాజకీయాలను ఖండించాలన్నారు సీఎం కేసీఆర్. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి బాధాకరమన్నారు. కత్తులు పట్టుకుని బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడులు చేస్తున్నారన్నారు. బాగా పనిచేసే నాయకులపై దాడి చేశారన్నారు.

కత్తులు పట్టుకుని భారాస అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని…మా సహనాన్ని పరీక్షించవద్దన్నారు. మాకు తిక్క తిరిగితే రాష్ట్రంలో దుమ్ము రేగుతుందన్నారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి నా పై జరిగినట్లే అని భావిస్తున్న అన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నాం కాబట్టే సహనంతో ముందుకు పోతున్నామన్నారు.

కత్తితో పోడవాలంటే మాకు చేతులు లేవా అన్నారు. ఎన్నికలను ఎదుర్కొలేక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హింసా రాజకీయాలను ప్రజలంతా ఖండించాలని..ప్రజా సేవ చేస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.

Also Read:‘దేవర’ పై క్రేజీ గాసిప్స్

- Advertisement -