తెలంగాణలో మరోసారి కేంద్ర బృందం పర్యటన..

174
Central Team
- Advertisement -

తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలలో కరోనా ఉదృతి తీవ్రంగా ఉండడంతో కేంద్ర బృందాలు ఈ మూడు రాష్ట్రల్లో పర్యటించనుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని ఈ బృందం 26 నుంచి ఈ నెల 29వరకు రాష్ట్రాలను సందర్శించనుంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ఆయా రాష్ట్రాల అధికారులతో కేంద్ర బృందం చర్చలు జరపనుంది.

కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర బృందం రాష్ట్రాలతో చర్చించనుంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 13012గా ఉంది. దీంతో దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 271696కు చేరింది. మొత్తంగా దేశంలో కరోనా రికవరీ రేటు 57.43గా ఉంది.

- Advertisement -