టీకా డోసుల సంఖ్య పెంచండి…రాష్ట్రాలకు కేంద్రం లేఖ

266
covid
- Advertisement -

కోవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ లేఖ రాసింది. కోవిడ్-19 మీద టీకాల నిర్వహణ మీద ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం సూచన ఆధారంగా నిర్ణయం తీసుకుంది కేంద్రం. కోవిషిల్డ్ టీకా మొదటి, రెండవ డోసుల మధ్య వ్యవధి 4-8 వారాలు ఉండాలని గతంలో సూచించినప్పటికీ ఇప్పుడు దాన్ని 6-8 వారాలకు పెంచాలని నిపుణుల బృందం సిఫార్సు చేసింది.

ఈ సిఫార్సు కోవిషీల్డ్ టీకాకే తప్ప కొవాక్సిన్ కు వర్తించదని స్పష్టం చేసింది కేంద్రం. ఈ మేరకు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. నిపుణుల బృందం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని అందువలన రాష్ట్రాలు కోవిషీల్డ్ టీకా లబ్ధిదారులకు రెండో డోస్ వ్యవధిని పెంచాలని సూచించింది.

కోవిషీల్డ్ రెండో డోస్ వ్యవధిని 6-8 వారాలకు పెంచటం వలన రక్షణ పెరుగుతున్నట్టు తేలినట్లు పేర్కొంది కేంద్రం. అయితే రెండో డోసు 8 వారాలకు మాత్రం మించకూడదని స్పష్టం చేసింది. సంబంధిత అధికారులందరికీ దీనికి అనుగుణంగా ఆదేశాలివ్వాలని, మారిన వ్యవధి మీద స్థానికంగా తగిన విధంగా ప్రచారం చేయాలని లేఖలో కోరారు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి.

- Advertisement -